ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగిసిన ఏపీ ఆసెంబ్లీ సమావేశాలు !

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2019, 08:05 PM

ఏపీ ఆసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. మంగళవారం ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులపాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ,ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, సభ్యులు ఎమ్మెల్యేలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అనంతరం, స్పీకర్‌గా తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఎన్నికయ్యారు. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ వాడీవేడిగా జరిగింది.చివరగా ప్రత్యేక హోదాపై శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com