ఏపీ ఆసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. మంగళవారం ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులపాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ,ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, సభ్యులు ఎమ్మెల్యేలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అనంతరం, స్పీకర్గా తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్గా కోన రఘుపతి ఎన్నికయ్యారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ వాడీవేడిగా జరిగింది.చివరగా ప్రత్యేక హోదాపై శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.