ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన వైసీపీ నుంచి బాపట్ల ఎమ్మెల్యేగా గెలిచారు. కోన రఘుపతిని ప్రతిపాదిస్తూ 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో కోన రఘుపతి ఉపసభాపతిగా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అనంతరం సభ్యులు అభినందనలు తెలియజేశారు. కోన రఘుపతిని గౌరవ పూర్వకంగా సభాపతి కూర్చీవరకు సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి, ప్రతపక్ష నేత చంద్రబాబు నాయుడు తీసుకువెళ్లారు.