యూపీలో ఇప్పటికే అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ ఖాతాలో వారణాసి కూడా చేరింది. వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన పీఎం నరేంద్ర మోదీ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. షాలినీ యాదవ్ పై నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో తన సమీప ప్రత్యర్థిపై భారీ విజయం సాధించాను. ఇక్కడి నుంచి వరుసగా రెండో సారి మోదీ పోటీ చేసి గెలుపొందారు. మోదీ గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. వారణాసిలోనే బీజేపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు.