ఏపిలో ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పైన కసరత్తు మొదలైంది.హైకోర్టు అదేశాల మేరకు ఓటర్ల జాబితా విడుదలకు అధికారులు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటంతో అధికార యంత్రాంగం ముందుకు కదలింది.ఏపిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మే 1 నాటికి ఓటర్ల జాబితా విడుదల చేయాలని హైకోర్టు ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది.దీంతో మే 1న ఓటర్ల జాబితా విడుదలకు రంగం సిద్దం చేస్తున్నారు.దీంతో మున్సిపల్ అధికారులు యుద్ధప్రాతిపదికన ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు.ఓటర్ల జాబితాలను రూపొందించే పనిలోనూ నిమగ్నమయ్యారు.