హైదరాబాద్ : వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరారు. కాసేపట్లో పులివెందులలో నిర్వహిస్తున్న బహరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అయిపోయాక మధ్యాహ్నం 1.49 నిమిషాలకు జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. జగన్ తో పాటు తల్లి విజయమ్మ, భార్య భారతిలు పులివెందులకు బయల్దేరారు.