లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బహుజన్ సమాజ్వాదీ పార్టీ చీఫ్ మాయావతి వెల్లడించారు. ఈసారి లోక్సభ ఎన్నికల కోసం ఎస్పీతో బీఎస్పీ జత కట్టిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది జూలైలో మాయావతి రాజ్యసభకు రాజీనామా చేశారు. కేవలం పార్టీ ప్రచారంపైన మాత్రమే ఫోకస్ చేయనున్నట్లు ఆమె చెప్పారు. రెండు పార్టీల తరపున యూపీలో మాయావతి ప్రచారం నిర్వహించనున్నారు.