అధికార పెద్దలు కొందరు మా నాన్న హత్యపై ఇష్టానుసార వ్యాఖ్యలు చేస్తున్నారు. సిట్ విచారణ కాకముందే నిర్ణయాలు చెప్పేస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్లే అలా చెబితే సిట్ విచారణపై ప్రభావం చూపదా? లెటర్ ఎవరు రాసిందన్నది ఫోరెన్సిక్ నివేదికలో తేలుతుంది కదా..! నాన్న మృతి తెలిసి సన్నిహితులు చాలా మంది ఇంటికి వచ్చారు. ఆ సమయంలో వాళ్లు తప్పు చేశారని ముందే ఎలా చెబుతారు? మీడియా, రాజకీయ నాయకులకు మనవి చేస్తున్నా.. సమన్వయం పాటించండి. మా కుటుంబం మధ్యే బేధాభిప్రాయాలు కల్పించే ఉద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారు. పోలీసు విచారణ సక్రమంగా జరగనివ్వాలని కోరుతున్నా. ప్రత్యేక దర్యాప్తు బృందం తన పని తాను చేసుకునేలా వ్యవహరించండని సునీత కోరారు.