ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాంబు కలకలం చెలరేగింది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలం ఇంగ్లీష్ పాలెంలో బాంబులను దాచినట్లు పోలీసులకు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈరోజు ఇంగ్లీష్ పాలెంలోని ఓ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో దాచిని బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలిపామనీ, విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ బాంబును ఎవరు తెచ్చారు? దాడి చేయడానికి సిద్ధమవుతున్నారా? ఎవరినైనా లక్ష్యంగా చేసుకున్నారా? అనే కోణంలో విచారణ సాగుతున్నట్లు చెప్పారు.