నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పనులు భారీగా చేశామని అందువల్ల ధైర్యంగా ఓట్లు అడగవచ్చు అని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి తెలిపారు. నెల్లూరు లో గురువారం జరిగిన ఆత్మీయ స్వాగతం కార్యక్రమంలో నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆత్మీయ అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు లో జిల్లా రాష్ట్ర స్థాయి నేతలు చాలామంది కలిసి స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు.చాలా విషయాలను నా దృష్టికి తెచ్చారని గతాన్ని వెనక్కి తీసుకు రావడం కుదరదు. అటువంటి జరక్కుండా చూసుకుందామని తెలిపారు.మీరు చెప్పే వాటికి కట్టుబడి ఉంటానని చెప్పారు మనం ఈ ప్రాంతంలో చాలా పనులు చేశామని అందువల్ల సగర్వంగా ఓటర్ల దగ్గరకు వెళ్ళవచ్చు అన్నారు.మంత్రి నారాయణ మొదట నిబంధనలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు చేసిన ఆ తర్వాత చేసిన సూచనలను బట్టి నిధులను పెంచారని తెలిపారు.చివరి సంవత్సరం ఎక్కువ నిధులను తీసుకువచ్చి ఎన్నో పనులు చేశారని కొనియాడారు.అందులో భాగంగా మనం కట్టుకున్న నెక్లెస్ రోడ్డు జిల్లాకు మణిహారంగా నిలిచిందని తెలిపారు.అలాగే పెన్షన్లు రేషన్ కార్డులు గ్యాస్ కనెక్షన్లు మరుగుదొడ్లు ఇలా ఎన్నో నూటికి నూరుశాతం నెరవేర్చా మని చెప్పారు.
పొదుపు మహిళలకు నిధులు ఇచ్చామని వారిప్పుడు సంతోషంగా ఉన్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు అన్ని వర్గాలకు కేంద్ర బిందువు లాంటిది అందుకే మొదటి నుంచి దీనిపై దృష్టి సారించామని తెలిపారు.గత ఎన్నికల్లో కొన్ని తప్పులు జరిగాయని ఈసారి అటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.అందరికీ సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ ఎన్నికల్లో ఐకమత్యంగా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.అనంతరం నెల్లూరులోని వీధుల్లో పర్యటించి స్థానికులను విచారించారు.వారు చెప్పిన సమస్యలను సావధానంగా విని పరిష్కారాలకు హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో ఖాజావలి స్వర్ణ వెంకయ్య శైలేంద్ర బాబు షాజహాన్ పిటి రంగ రాజన్ హరిబాబు యాదవ్ గంగాధర్ సుధాకర్ యాదవ్ రమణయ్య బద్దెపూడి రవీంద్ర పరదేశి రఘురామయ్య అవినాష్ కార్పొరేటర్ సూరి వెంకటేశ్వర్లు నాయుడు నరసింహ రావు శేషు మాతంగి కృష్ణ పద్మజా యాదవ్ లచ్చా రెడ్డి మధు తదితరులు పాల్గొన్నారు.