కోల్కతాలో ర్యాలీ విజయవంతమైందని, అమరావతిలో బీజేపీ వ్యతిరేకపక్షాల తదుపరి సభ జరుగుతుందని మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడారు. ప్రాంతీయ, జాతీయ పార్టీల కలయికతోనే కోల్కతా ర్యాలీ జరిగిందన్నారు. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చాయన్నారు. కోల్కతా ర్యాలీకి కేసీఆర్, జగన్ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ఈ ర్యాలీకి వైసీపీకు ఆహ్వానం రాలేదు… జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 2019లో దేశానికి కొత్త ప్రధాని వస్తారన్నారు. తదుపరి ర్యాలీ అమరావతిలో నిర్వహించేందుకు చంద్రబాబు ఆహ్వానించారన్నారు. మోడీ, కేసీఆర్ ఫిడేల్ ఫ్రంట్లో జగన్ ఎందుకు భాగస్వామ్యం అవుతున్నావని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు.