అమరావతి : దేవదాయ శాఖ, అనుబంధ సంస్థలతో ఉపముఖ్యమంత్రి కే.ఈ. క్రిష్ణమూర్తి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో దేవాదాయ శాఖ సలహాదారు రామకోటయ్య, బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ ఆనంద సూర్య, హిందూ ధార్మిక పరిషత్ ట్రస్ట్ ఛైర్మన్ ప్రసాద్, వేదిక్ యునివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ సుదర్శన శర్మ, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అనుబంధ సంస్థల ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను ఉపముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.