గోవా ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనుంది. కోస్తా ప్రాంతంలో జరగబోయే ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ అధ్యక్షుడు దీపక్ ధవిల్కార్ మీడియాకు చెప్పారు. పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాము పార్టీ ఫిరాయింపులకు, ఫిరాయింపుదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు.