ఏపీలో జరుగుతున్న అభివృద్దిని చూసి మోడీ, కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతుల ఆత్మహత్యల్లో మాత్రమే తెలంగాణ ముందుస్థానంలో ఉందన్నారు. తెరాస హయాంలో తెలంగాణలో 4వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సీఎం చంద్రబాబుపై కేసీఆర్, జగన్ ద్వేషంతో రగిలిపోతున్నారన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎఫ్ సీఐ ముందుకు రాలేదన్నారు. రైతుల పట్ల కూడా కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. ఎన్డీఏ మిత్రపక్షంగా ఉండి కూడా భాజపాపై పోరాటం చేశామన్నారు.