కర్నూలు : దేశంలో మూడో ఫ్రంట్ కు మనుగడ లేదని ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ముడుపుల కోసమే జగన్ – కేటీఆర్ భేటీ అయ్యారన్నారు. అసదుద్దీన్ బీజేపీ ఏజెంట్ అన్నారు. ఏపీలో ప్రచారం చేయడం కాదు…పక్కన సికింద్రాబాద్ లో అసదుద్దీన్ పోటీ చేసి సత్తా చూపాలన్నారు. దమ్ముంటే నంద్యాలలో అసదుద్దీన్ నాపై పోటీ చేయాలన్నారు. ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామన్నారు.