సోషల్ మీడియాను దుర్వినియోగం చేసింది వైసీపీనే అని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎలక్షన్ మిషన్ 2019పై నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సోషల్ మీడియాతో అసభ్య ప్రచారం చేసింది వైసీపీనే అన్నారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పై మొదట్లోనే వైసీపీ దుష్ప్రచారం చేసిందన్నారు. జగన్ పై దర్యాప్తు జరగకుండా చేయాలని కుట్రలు చేశారన్నారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై అసభ్యంగా ప్రచారం చేశారన్నారు. టీడీపీ మహిళా నేతలపైనా అసభ్యంగా ప్రచారం చేశారన్నారు. నా కుటుంబ సభ్యులపైన కూడా దుష్ప్రచారం చేశారన్నారు. సోషల్ మీడియాను ఎవరు దుర్వినియోగం చేసినా సహించేది లేదన్నారు. పార్టీలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హద్దులు దాటితే కఠినంగా వ్యవహరిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.