అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా అత్యాధునిక క్యాథ్ల్యాబ్ సేవలను ఆరోగ్యశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.కోట్ల రూపాయిల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ క్యాథ్ల్యాబ్ తొలుత గుంటూరులో అనంతరం విశాఖ, విజయవాడ ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి రానుంది.దక్షిణ భారతదేశంలో ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ లేని అత్యాధునిక ‘న్యూ ఫ్లాట్ ప్యానెల్ డిజిటల్ క్యాథ్ల్యాబ్’ను ఆరోగ్యశాఖ ఈ మూడు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తోంది.
ఇప్పటికే గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో క్యాథ్ల్యాబ్ మిషన్ ఏర్పాటు, నిర్మాణం పూర్తయ్యాయి. బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబు దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మరో పది రోజుల్లో విశాఖపట్నంలో కూడా మిషన్, నిర్మాణ పనులు పూర్తవుతాయి. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మాత్రం జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.క్యాథ్ల్యాబ్ రాకతో ప్రభుత్వాస్పత్రుల్లోనూ ప్రైవేటుకు దీటుగా గుండె సంబంధింత సేవలు లభించనున్నాయి.