ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారందరికీ ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 18, 2018, 01:36 PM

న్యూఢిల్లీ : దేశంలోని నిరుపేదలకు కేంద్రం శుభవార్త తెలిపింది. 2011 సాంఘీక ఆర్థిక సర్వే కింద‌ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేద‌ల‌కు ఉజ్వల పథకం కింద ఉచితంగా ఎల్పీజీ  గ్యాస్ కనెక్షన్లు అందించే పథకాన్ని కొనసాగించాలని  కేంద్రం నిర్ణయించుకుంది. ఈమేర‌కు ఈ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ వెల్లడించారు. ఇదిలా ఉండ‌గా దేశంలో 27 కోట్ల ఇళ్లు ఉండగా 2014 మే నాటికి వీరిలో కేవలం 13 కోట్ల మందికే ఎల్పీజీ గ్యాస్‌ కనెన్షన్లు ఉన్నాయి. రాబోయే నాలుగున్నరేళ్లలో 90 శాతం మందికి గ్యాస్ కనెక్షన్లు అంద‌జేసేలా రూ.1600 సబ్సిడీతో ఈ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందిచ‌నున్న‌మ‌ని మంత్రి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com