హైదరాబాద్ : మద్దెలచెరువు సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 20 వేల జరిమానా విధించింది కోర్టు. రెండో నిందితుడు మన్మోహన్ సింగ్ కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధించింది. మరో నలుగురిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది. భాను కిరణ్, మన్మోహన్ సింగ్ ను నాంపల్లి కోర్టులో ఇవాళ ఉదయం పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. భాను కిరణ్ సహా ఆరుగురు నిందితులపై విచారణ పూర్తయింది. ఆరున్నరేళ్లుగా మలిశెట్టి భానుకిరణ్ జైల్లో ఉంటున్నారు. 2011, జనవరి 3న యూసుఫ్ గూడలో సూరి హత్యకు గురైన విషయం తెలిసిందే. భాను కిరణ్ ను 2012 ఏప్రిల్ 21న పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితులను 2011, జనవరి 29న అదుపులోకి తీసుకున్నారు.