ఈ ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో, రేణిగుంటలో దిగే అవకాశం లేదని భావించిన పైలట్, దాన్ని తిరిగి హైదరాబాద్ మళ్ళించాడు. ఇంకా ఆ విమానం హైదరాబాద్ కు చేరలేదు. ఈ విమానంలో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ సహా పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్నారు. విమానం వెనుదిరగడంపై మరింత సమాచారం తెలియాల్సివుంది.