హోంశాఖ సంచల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి సంభందించిన సాధారణ సమ్మతి నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. ఈ నెల 8న నోటిఫికేషన్ ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జీవోను కాంఫిడెన్సిల్ గా ఉంచడంతో ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ మినహా ఇతర రాష్ట్రాల్లో సీబీఐ సోదాలకు ఆయా రాష్ట్రాల సమ్మతి అవసరమన్న ప్రభుత్వం. ఆగస్టు 3న నోటిఫికేషన్ ఉపసంహరణకు సర్కార్ సమ్మతించింది. సీబీఐ ప్రతిష్ట మసకబారడంతో ప్రభుత్వ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రాలలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవకతవక దర్యాప్తుకు ఇకపై సిబిఐకి నో పర్మిషన్ రాష్ట్రాల్లోని కేంద్ర సంస్థలపై ఏసీబీ సోదాలకు ఛాన్స్ ఉంటుంది. సీబీఐ న్యాయవిచారణ ఢిల్లీ వరకేనన్న ప్రభుత్వ యంత్రాంగం.