బెంగళూరు : గాలి జనార్ధన్ రెడ్డికి కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈనెల 24వతేదీ వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. అంబిడెంట్ కంపెనీ తరుపున ఈడీకి లంచం కేసులో గాలిజనార్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. సీసీబీ కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం నుంచి గాలి జనార్ధన్రెడ్డిని ప్రశ్నించిన పోలీసులు రూ.18 కోట్ల లంచం కేసులో అరెస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి రెండు గంటల వరకు సీసీబీ పోలీసులు గాలి జనార్ధన్రెడ్డిని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం మళ్లి ప్రశ్నించడం ప్రారంభించిన పోలీసులు కొద్దిసేపటి క్రితం గాలిజనార్ధన్రెడ్డిని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చగా 24వతేదీ వరకు జ్యుడీషియర్ కస్టడీకి కోర్టు అనుమతించింది.