ఆంధ్రప్రదేశ్లో కరవు విలయతాండవం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కర్నూలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోరామకృష్ణ మాట్లాడుతూ తుఫాన్తో ఉత్తరాంధ్ర నష్టపోయిందని, రైతులు నష్టపోయారన్నారు. కరవు, తుఫాన్ ప్రభావంపై కేంద్రం కనీసం స్పందించలేదన్నారు. ఏపీ ప్రజలు భారతదేశంలో లేనట్టు మోడీ వ్యవహరిస్తున్నారన్నారు. 3న విజయవాడలో వామపక్షాల సమావేశం నిర్వహిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై సమావేశంలో చర్చిస్తామన్నారు. జగన్పై దాడి జరిగితే చంద్రబాబు పరామర్శించక పోవడం తప్పేనన్నారు. చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకున్నారని పేర్కొన్నారు.