విజయవాడలో జనసేన నూతన కార్యాలయంలోకి వేద మంత్రోచ్ఛరణల మధ్య పవన్ కళ్యాణ్ ప్రవేశించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్తో, తోట చంద్రశేఖర్, ముత్తా గోపాలకృష్ణ, మాదాసు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.