దేశ వ్యాప్తంగా లారీ యజమానుల సమ్మె కొనసాగుతోంది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లారీ యజమానులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. సమ్మెతో తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల లారీలు నిలిచిపోయాయి. పెట్రోల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని, థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ప్రీమియం తగ్గించాలని లారీల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.