నూతన భారతదేశంలో అవినీతికి, ఉగ్రవాదానికి తావుండదని, కులరహిత సమాజం ఏర్పడుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా అన్నారు. గాంధీనగర్లో కర్నావటి విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో అమిత్షా మాట్లాడుతూ భారతదేశం ఎంతో పురాతనమైన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. 2025లో భారత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే, మన గత చరిత్రను అధ్యయనం చేయాలని, ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాలని ఆయన అన్నారు.