నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్-ఖప్లాంగ్ సంస్థ ఉగ్రవాదులు అస్సాం రైఫిల్స్ జవాన్లపై దాడి చేసి ఇద్దరిని హతమార్చారు. ఈ దాడిలో మరొక నలుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు. నాగాలాండ్లోని మాన్ జిల్లా అబొయ్లో ఈ దాడి జరిగిందని అస్సాం రైఫిల్స్ ఐజి పిఆర్ఒ తెలిపారు. హవల్దార్ ఫతే సింగ్ నేగి, సిపాయి హంగన్గ కొన్యాక్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారని, మరొక నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయని పిఆర్ఒ చెప్పారు.