హిందువులకు, బౌద్ధులకు పవిత్రమైన నేపాల్లోని ప్రఖ్యాత ముక్తినాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్రమోడీ శనివారం పూజలు నిర్వహించారు. ప్రపంచంలోనే అక్కడ పూజలు నిర్వహించిన మొట్టమొదటి నాయకుడు ఆయనే. భాగ్మతి నది ఒడ్డున ఉన్న అతిపురాతన పశుపతినాథ్ ఆలయంలో కూడా మోడీ పూజలు చేశారు. ప్రార్థనల అనంతరం అక్కడ సందర్శకుల కోసం ఉంచి పుస్తకంలో మోడీ సంతకం చేశారు.