రాంచీ : జార్ఖండ్లో దుమ్కా జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ జంట మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న కారు, బస్సును ఢీ కొట్టింది. ఘటనలో కారు డ్రైవర్ కూడా అక్కడిక్కడే మరణించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. వారి వివాహాం అనంతరం కారులో బీహార్లోని బాగల్పూర్కు వెళుతుండగా దుమ్కా- భాగల్పూర్ రోడ్డులో కస్బా రౌండ్అబౌట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.