పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 16వ జాతీయ రహదారిపై ఓ మినీ వ్యాను అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యానులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, లారీలో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఏలూరు త్రీటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.