జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిలిమ్ చాంబర్ కు చేరుకున్నారు. తన సోదరుడు నాగబాబుతో కలిసి ఫిలిమ్ చాంబర్ కు చేరుకున్న పవన్ కల్యాణ్ న్యాయవాదులతో సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పిలిమ్ చాంబర్ కు చేరుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ పై వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్ తదుపరి కార్యాచరణలో భాగంగా ఫిలిమ్ చాంబర్ కు చేరుకుని అక్కడ న్యాయవాదులతో సమావేశమయ్యారు.