అమరావతి : తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. సభా నిబంధనలను తుంగలో తొక్కి అవిశ్వాసంనై సభలో చర్చకు అనుమతించకుండా ప్రభుత్వం పారిపోయిందని విమ్శించారు. నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానంపై 50 మంది సభ్యులు సంతకాలు పెట్టి లేచి నిలబడితే అనుమతించాల్సిందేనని అయితే అందుకు విరుద్ధంగా స్పీకర్ సభ ఆర్డర్ లో లేదంటూ వాయిదావేసి వెళ్లిపోయారని యనమల విమర్శించారు.