న్యూఢిల్లి : ఎన్డిఎనుంచి తెలుగుదేశం పార్టీ బైటకు వెళ్లడం వ్యూహాత్మక తప్పిదమని బిజెపి అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు అన్నారు. రాజకీయ ఎత్తుగడల కోసమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని నరసింహారావు అన్నారు. 29 సార్లు ఢిల్లి వెళ్లినప్పటికీ కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయలేదని చంద్రబాబు నాయుడు చెప్పడం ఆయన అసమర్ధతకు నిదర్శనమని నరసింహారావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.