న్యూఢిల్లి : క్షయవ్యాధిని 2025 సంవత్సరాంతానికి సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు. ‘ఎండ్ టిడి సమ్మిట్’లో మోడీ ప్రసంగించారు. క్షయ వ్యాధిని నిర్మూలించడంలో ఇప్పటికీ విజయం సాధించలేకపోయామని ఆయన అన్నారు. పది పదిహేనేళ్లుగా కృషి చేస్తున్నప్పటికీ ఒక వ్యాధిని నిర్మూలించలేకపోయామంటే మన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరముందని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.