వారణాశి : ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రోన్ నేడు వారణాశిలో మోడీతో కలిసి నౌకా విహారం చేయనున్నారు. అస్సి ఘాట్నుంచి దశాశ్వమేథ ఘాట్ వరకూ కైలాస అనే బోటులో మోడీ, మాక్రోన్లు ప్రయాణిస్తారు. నేటి ఉదయమే ఇక్కడి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ తరువాత వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్కు స్వాగతం పలికారు.