అమరావతి: ప్రజల మనోభావాల ప్రకారం పోరాటం ఉధ్ధృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలతో అన్నారు. పార్టీ ఎంపీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు… ఏపీకి న్యాయం, విభజన హామీల అమలుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. సభ నుంచి సస్పెండ్ చేసినా వెనకంజ వేయొద్దని పేర్కొన్నారు. లక్ష్యం నెరవేరేదాకా పోరాటం సాగించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.