ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు వేషధారణలో టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ వినూత్న నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 07, 2018, 11:41 AM

ఢిల్లీ : పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ వినూత్న నిరసన తెలిపారు. రైతు వేషధారణలో వచ్చిన శివప్రసాద్‌ పార్లమెంటు ఆవరణలో నిరసనను వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం చేయాలని, విభజన హామీలను అమలు చేయాలని గత కొన్ని రోజులుగా టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ధర్నాలు, నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. నిరసనలో భాగంగా టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ కావడితో రైతువేషాధారణలో వచ్చి కేంద్ర ప్రభుత్వానికి తన నిరసనను తెలిపారు. ఏపీ రాజధానికి ప్రధాని ఇచ్చిన మట్టి, నీటిని ఎంపీ శివప్రసాద్‌ రెండు కుండల్లో తీసుకొచ్చారు. కావడితో వచ్చిన శివప్రసాద్‌ పవిత్ర మట్టి, నీటిని స్పీకర్‌ ద్వారా తిరిగి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com