ప్రముఖ సినీనటి శ్రీదేవి మృతి పట్ల మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించిన సచిన్ శ్రీదేవి మన మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నానన్నారు. శ్రీదేవి మరణవార్త విన్న ఆయన తనకు మాటలు రావట్లేదని, ఎలా స్పందించాలో తెలియట్లేదన్నారు. శ్రీదేవి సినిమాలు చూస్తూ పెరిగామని ఆయన గుర్తు చేశారు.