బెంగళూరు : ప్రధాని పదవికి నరేంద్ర మోడీ అనర్హుడని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. దేశానికి, రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యలున్నాయని, మోడీ ఆ సమస్యలపై పెదవి విప్పడం లేదని ఆయన అన్నారు. మోడీ కేవలం రాజకీయ దురుద్దేశ్యాలతో, బాధ్యతారహితంగా ప్రకటనలు చేస్తున్నారని సిద్ధరామయ్య విమర్శించారు.