ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రికి సందర్శించి తనిఖీలు చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో సెల్ ఫోన్ వెలుగులో శస్త్ర చికిత్సలు జరిగిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ థియోటర్ లో లైట్లు లేకపోవడంతో వైద్యులు సెల్ ఫోన్ వెలుగులోనే శస్త్ర చికిత్సలు చేస్తున్న విషయం నిన్న వెలుగులోనికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ ఉదయం ఆసుపత్రికి నందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సెల్ ఫోన్ వెలుగులో శస్త్ర చికిత్సలు జరిగిన థియోటర్ ను పరిశీలించారు.