స్పీకర్ కోడెల శివప్రసాద్ కు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కోడెల శివప్రసాద్ ను వామపక్ష నేతలు, న్యాయవాదులు అడ్డుకున్నారు. జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. కోడెలను అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, వామపక్షాల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు.