తిరుపతి: తిరుమల శ్రీవారిని ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శించుకున్నాడు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నాడు. టీటీడీ అధికారులు దగ్గరుండి ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి పట్టువస్త్రాలను, తీర్ధప్రసాదాలను రవికుమార్ కు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డైరెక్టర్.. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.