పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు వైఎస్సార్సీపీ వెంటే నిలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ఫ్యాను గుర్తుకే తమ ఓటు అంటూ చాటిచెప్పారు. 48 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు అందిన ఫలితాలు వైఎస్సార్సీపీ 2 స్థానాల్లో గెలుపు సాధించగా మిగిలిన పార్టీలు ఖాతా తెరవలేదు. 863 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా వైఎస్సార్సీపీ 63 స్థానాలు, టీడీపీ 3 స్థానాలు, బీజేపీ 1, ఇతరులు 4 స్థానాల్లో గెలుపు సాధించారు.