భవిష్యత్ లో బంగారు బాటలు వేసే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని గజపతినగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గంట్యాడ మండలంలోని గొడియాడ గ్రామంలో సర్పంచ్ వెంకటేష్, ఎంపీటీసీ సన్యాసిరావుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాక్షస పాలన తరిమికొట్టేందుకే టిడిపి, జనసేన, బిజెపి కలిశాయన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలన్నారు. కొండపల్లి భాస్కరనాయుడు పాల్గొన్నారు.