పశ్చిమ గోదావరి జిల్లాలో 13, 656 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ గురువారం తెలిపారు. శుక్ర, శనివారం కూడా సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. కాగా, గురువారం తాడేపల్లిగూడెంలో 63 మంది, తణుకు 32, ఉండి 34, భీమవరం 255, నరసాపురం 37, పాలకొల్లు 30, ఆచంట 28 మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు.