ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో గురువారం రాత్రి టీడీపీలో చేరడానికి వస్తున్న వైసీపీ నాయకుల పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పరిటాల సునీత శుక్రవారం డిమాండ్ చేశారు. కనగాణపల్లి పల్లి మండలం తగరకుంట గ్రామానికి చెందిన వారిపై ఎమ్మెల్యే సోదరుడు రాజారెడ్డి తన అనుచరులతో దాడి చేశారని తెలిపారు. గాయపడిన వారిని అనంతపురం ఆసుపత్రిలో పరామర్శించారు.