శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణం టిడిపి కార్యాలయం వద్ద శుక్రవారం మందలపల్లికి చెందిన 30 కుటుంబాలు వైసిపి నుండి టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా టిడిపి మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ మద్దనకుంటప్ప, మాజీ సర్పంచ్ సన్నమరప్ప పాల్గొన్నారు.