మహారాష్ట్రలోని భోర్ఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబయి-పుణె ఎక్స్ప్రెస్వేపై ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు అదుపు తప్పి రెండు వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.