సంక్షేమ పథకాల పంపిణీకి హైకోర్టు అనుమతి ఇవ్వడం హర్షణీయమని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. హైకోర్టు తీర్పుతో కూటమి పార్టీలకు షాక్ ఇచ్చినట్లయితే అయిందని పేర్కొన్నారు. టిడిపి ఫిర్యాదుతో సంక్షేమ పథకాలు పంపిణీ జరగకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పథకాలు కొత్తవి కాదని. ఎప్పటి నుంచో అమలవుతున్నాయని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు.