శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కర్ణాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన నాగేపల్లి, వెంగళమచెరువు గ్రామాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు గురువారం ఉదయం 10 గంటలకు ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా గ్రామాల్లోని విధుల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలను అలాగే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధించారు. దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గెలిస్తేనే పుట్టపర్తి అభివృద్ధి సాధ్యమని గత రెండు ప్రభుత్వాల హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో సంతోష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, రవి, గౌస్ బడా, సీనియర్ నాయకులు బాబు, లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.