శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం కూచివారి పల్లి గ్రామం, అచ్చుతాపురం గ్రామాలలో శుక్రవారం ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే కె. సుదర్శన్, జనార్దన్ రెడ్డి, మహేష్ నాయుడు, ఎంగప్పనాయుడు లను వారి నివాసాలలో కలిశారు. ఈ సందర్భంగా అంబికా మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.